Robert Romawia Royte: అత్యధిక సంతానం ఉంటే.. రూ. లక్ష.. మిజోరాం మంత్రి బంపర్ ఆఫర్..
Mizoram Minister Robert Romawia Royte: దేశంలో జనాభా నియంత్రణ అవసరమంటూ.. ఇటీవల పలువురు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిజోరం క్రీడాశాఖ మంత్రి
Mizoram Minister Robert Romawia Royte: దేశంలో జనాభా నియంత్రణ అవసరమంటూ.. ఇటీవల పలువురు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్తే సంచలన ప్రకటన చేశారు. మిజో తెగ జనాభాను పెంచేందుకు రాబర్ట్ రోమవీయా బంపర్ ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత తరుణంలో మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి రోమవీయా ఈ ప్రకటనను చేశారు.
లబ్ధిదారులు నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చును మంత్రి తనయుడి ఆధ్వర్యంలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ భరిస్తుందని పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభా లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజనుల్లో.. మిజోలు లాంటి చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారిందని.. అందుకే ఇలాంటి ప్రోత్సహాకాలు అవసరమని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు.
Also Read;