రియాకు మరో షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ ఎన్డీపీఎస్ కోర్టు తీర్పు వెల్లడించింది
Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ ఎన్డీపీఎస్ కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో అక్టోబర్ 6 వరకు ఆమె జైలులోనే ఉండనుంది. ఇదిలా ఉంటే మరోవైపు బెయిల్ కావాలంటూ రియా, ఆమె సోదరుడు షోవిక్ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు.
అయితే జూన్ 14న ముంబయిలోని తన స్వగృహంలో సుశాంత్ ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. డిప్రెషన్తో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే సుశాంత్ది ఆత్మహత్య కాదని, హత్య అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా తన కుమారుడి అకౌంట్ నుంచి రియా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.
ఇక ఈ కేసులో ముంబయి పోలీసులు సరైన విచారణ జరపడం లేదని, దీన్ని సీబీఐకి అప్పగించాలంటూ అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో ఎన్సీబీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం సుశాంత్ కేసును సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు.
Read More:
సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సీనియర్ నటి కన్నుమూత
శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు