Rahul Gandhi: పెరిగిన ఇంధన ధరలపై రాహుల్ వినూత్న నిరసన.. సైకిల్ తొక్కుతూ పార్లమెంటుకు..
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందన్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్పై పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.
Rahul Gandhi bicycle ride to Parliament: రోజురోజుకూ చుక్కలనంటుతున్న పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యవసరాల ధరలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మంగళవారంనాడు సైకిల్పై పార్లమెంటు సమావేశాలకు వచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ కలిసి పోరాడాల్సిన అవసరముందని రాహుల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందన్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్పై పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.
అంతకుముందు లోక్సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీలు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ సమావేశానికి హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్లు పాల్గొన్నారు. విపక్ష పార్టీ నేతలతో కాన్స్టూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి.. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు. విపక్ష పార్టీ నేతలతో బ్రేక్ఫాస్ట్ ముగిసిన తర్వాత.. రాహుల్ గాంధీ పార్లమెంట్కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పెగాసస్ వ్యవహారం, పెట్రో ధరలు, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. మరోవైపు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మాక్ పార్లమెంట్ నిర్వాహించాలని విపక్షాలు భావిస్తున్న విషయం తెలిసిందే.
Rahul Gandhi led the opposition's 'Cycle Protest', reached Parliament by bicycle. pic.twitter.com/0wMvdFWjQE
— Goa Pradesh Congress Sevadal (@SevadalGA) August 3, 2021
Read Also…