Covid-19: బెంగళూరులో స్మశానవాటికలన్నీ ఫుల్… కరోనా మృతదేహాలతో అంబులెన్సుల క్యూ..
Bengaluru crematoriums: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. ఎన్ని
Bengaluru crematoriums: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఈ తరుణంలో ఆక్సిజన్ కొరత, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరత పలు రాష్ట్రాలను వేధిస్తోంది. ఆక్సిజన్ సరైన సమయంలో అందక చాలామంది చనిపోతున్నారు. పలు చోట్ల హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోవిడ్తో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా సమయం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్మశానవాటికలన్నీ ఫుల్ అయి కనిపిస్తున్నాయి. నిత్యం 24 గంటలపాటు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూనే ఉన్నారు.
ఈ తరుణంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపస్తున్నాయి. స్మశానవాటికలన్నీ నిండిపోవడంతో మృతదేహాలతో అంబులెన్సులన్నీ క్యూలో నిరీక్షిస్తున్నాయి. టోకెన్ల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటంతో చాలా సమయం పడుతోందని బాధిత కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. నగరంలోని ఏడు స్మశానవాటికల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు వారా ల్లో 18-40 ఏళ్ల లోపువారు 60 మంది వరకు చనిపోయినట్లు బీబీఎంపీ గణాంకాలు పేర్కొంటున్నాయి. సోమవారం ఒక్కరోజే 100 మంది వరకూ మరణించారు.
ఈ క్రమంలో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఏడు ప్రత్యేక శ్మశానాల వద్దకు మృతదేహాలను తీసుకొచ్చిన అంబులెన్స్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూనే ఉన్నామని స్మశనావాటికల నిర్వాహకులు పేర్కొంటున్నారు. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో తామేమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా కర్ణాటకలో నిత్యం 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: