పాపం పసివాళ్లు.. పండ్ల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. రైల్వే ట్రాక్పై..
ఆదివారం కావడంతో పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్ పక్కనే బెర్రీ పండ్ల చెట్టు ఉందని, అక్కడ వాటిని కోసుకొని మంచిగా తినవచ్చని.. ఓ స్నేహితుడు చెప్పడంతో నలుగురు పిల్లలు కలిసి అక్కడికి వెళ్లారు.
Punjab tragedy: ఆదివారం కావడంతో పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్ పక్కనే బెర్రీ పండ్ల చెట్టు ఉందని, అక్కడ వాటిని కోసుకొని మంచిగా తినవచ్చని.. ఓ స్నేహితుడు చెప్పడంతో నలుగురు పిల్లలు కలిసి అక్కడికి వెళ్లారు. పండ్లు కోసుకుని రైల్వే ట్రాక్ పై కూర్చొని వారంతా తింటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన ట్రైన్ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రైల్వే ట్రాక్పై పండ్లు తింటుండగా.. రైలు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని.. మరోక చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం పంజాబ్లోని కిరాత్పూర్ సాహిబ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాత్పూర్ సాహిబ్లోని వలస కూలీల కుటుంబాలకు చెందిన 7 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు.. సట్లెజ్ నదిపై ఉన్న లోహాండ్ రైల్వే వంతెన సమీపం దగ్గర బెర్రీ పండ్ల కోసం వెళ్లారు. అనంతరం పండ్లు కోసుకుని రైల్వే ట్రాక్ పై కూర్చొని తింటున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు.
సహరాన్పూర్ నుంచి హిమాచల్ప్రదేశ్ వెళ్తున్న రైలు నలుగురు చిన్నారులను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. రైలు ఢీ కొట్టిన అనంతరం ఆగిందని పోలీసులు తెలిపారు. గమనించిన స్థానికులు గాయపడిన ఇద్దరు చిన్నారులను ఆనంద్పూర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. మరో చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ జగ్జిత్ సింగ్ తెలిపారు.
Kirtarpur Sahib, Punjab | Three children dead, one injured in a train accident
2 children died on spot. One died on way to hospital. 4th one is being treated. Children had come here to eat berries off trees & did not realise a train was approaching them: ASI GRP, Jagjit Singh pic.twitter.com/SWZQQ0f2bu
— ANI (@ANI) November 27, 2022
కాగా.. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పంజాబ్ లోని ఆప్ సర్కార్ విచారణకు ఆదేశించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. సంతాపం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..