వ్యభిచారం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.. స్వయంగా వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి..
మద్యప్రదేశ్లో రాష్ట్రంలో వ్యభిచార ముఠాలు చెలరేగిపోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి పేద బాలికలు, యువతులను అక్రమంగా తీసుకొచ్చి కొంతమంది గుట్టుగా
మద్యప్రదేశ్లో రాష్ట్రంలో వ్యభిచార ముఠాలు చెలరేగిపోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి పేద బాలికలు, యువతులను అక్రమంగా తీసుకొచ్చి కొంతమంది గుట్టుగా ఈ దందా నడిపిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో యువతులకు గాలం వేసి ట్రాప్ చేసి, ఈ రొంపిలోకి దించుతున్నారు. అమాయాకులైన అమ్మాయిల ధన, మాన, ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఇది మెట్రో నగరాలకే పరిమితం కాకుండా ఓ చైన్ సిస్టమ్లా పాకి చిన్న చిన్న పట్టణాలకు పాకింది.
తాజాగా పోలీసులు ఇటీవల ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ వివరాలను వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి ఇండోర్ కు బాలికలను తీసుకొచ్చి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నామని తెలిపారు. 21 మంది బంగ్లాదేశ్ బాలికలను రక్షించామని పేర్కొన్నారు. బాలికలకు డ్రగ్స్ ఇచ్చి, వారితో వ్యభిచారం చేయించారని, ఈ ముఠాకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. ఈ ముఠాలో నైజీరియా డ్రగ్ రాకెట్ పాత్ర కూడా ఉందంటున్నారు కొంతమంది. జిమ్ కోచ్లతో కుమ్మక్కై కొంతమంది డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘ విద్రోహ పనులు చేస్తే సహించబోమని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు.