PM Modi: వ్యర్థాల నుంచి సంపద.. భారీగా ఉపాధి అవకాశాలు.. 2జీ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
2G Ethanol Plant: ఏటా దాదాపు 2 లక్షల టన్నుల వరి గడ్డిని ఇందులో ఉపయోగించనున్నారు. "వ్యర్థాల నుంచి సంపద.." ప్రయత్నాలలో ఇది కొత్త అధ్యాయాన్ని మారుస్తుంది.
మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా హర్యానాలోని పానిపట్లో 2G ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆగస్టు 10, 2022న 4 గంటలకు జాతికి అంకితం చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దేశంలో జీవ ఇంధనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా తీసుకున్న సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ఇందులో భాగంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంధన రంగాన్ని మరింత సరసమైన, సమర్థవంతమైన, స్థిరమైనదిగా మార్చడానికి ప్రధాని మోదీ నిరంతర ప్రయత్నానికి ఇది విజయం అని ప్రదానమంత్రి కార్యాలయం తాజా ప్రకటనలో పేర్కొంది.
2జీ ఇథనాల్ ప్లాంట్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ద్వారా రూ. 900 కోట్లు, పానిపట్ రిఫైనరీకి సమీపంలో ఉంది. అత్యాధునిక స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఏటా దాదాపు 3 కోట్ల లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేయనున్నారు. ఏటా దాదాపు 2 లక్షల టన్నుల వరి గడ్డిని ఇందులో ఉపయోగించనున్నారు. “వ్యర్థాల నుంచి సంపద..” ప్రయత్నాలలో ఇది కొత్త అధ్యాయాన్ని మారుస్తుంది.