Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం.. అందుకున్న ప్రముఖులు వీరే..
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 119 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్లోని..
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 119 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక దర్బార్ హాల్లో అందించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను ఈ మహోత్సవంలో సత్కరించారు. ఈసారి రెండేళ్లపాటు అవార్డులు ఇస్తున్నారు. ఇందులో 2020 సంవత్సరానికి గాను నేడు 141 మందికి, మంగళవారం 2021కి గాను 119 మందికి పద్మ అవార్డులు అందజేయనున్నారు.
2021 సంవత్సరానికి పద్మ అవార్డుల జాబితాలో, 7 మందికి అతిపెద్ద పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు. దీంతో పాటు 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు.
అదే సమయంలో, 2020 సంవత్సరానికి, 7 మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలలో 29 మంది మహిళలు, 16 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు, 1 ట్రాన్స్జెండర్ అవార్డు గ్రహీత ఉన్నారు.
స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్..
స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్కు పద్వ భూషన్ను ప్రకటించారు.
Actor Kangana Ranaut receives the Padma Shri Award 2020. pic.twitter.com/rIQ60ZNd9i
— ANI (@ANI) November 8, 2021
పద్మవిభూషణ్ 2020..
- జార్జ్ ఫెర్నాండెజ్ (మరణానంతరం)
- అరుణ్ జైట్లీ (మరణానంతరం)
- సుష్మా స్వరాజ్ (మరణానంతరం)
- మారిషస్ మాజీ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి అనిరుద్ధ జుగ్నాథ్ (మరణానంతరం)
- ఆర్ట్స్ కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన పండిట్ చన్నులాల్ మిశ్రా
- క్రీడల కోసం మణిపూర్ మేరీ కామ్
- ఆధ్యాత్మికత కోసం కర్ణాటకలోని ఉడిపిలోని పెజావర్ మఠానికి చెందిన శ్రీ విశ్వేశతీర్థ స్వామి (మరణానంతరం)
Noted Hindustani classical singer Pandit Chhannulal Mishra receives the Padma Vibhushan award 2020. pic.twitter.com/IEsJ2AtGt3
— ANI (@ANI) November 8, 2021
పద్మవిభూషణ్ 2021లో అందుకోన్నవారు
- జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
- తమిళ గాయకుడు SP బాలసుబ్రమణ్యం (మరణానంతర కళ)
- మౌలానా వహీదుద్దీన్ ఖాన్
- డా. బేల మొన్నప హెగ్డే
- బీబీ లాల్
- అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీ
- ఆర్ట్స్ కోసం సుదర్శన్ సాహో
ఈ 10 మందికి పద్మభూషణ్ అవార్డు దక్కనుంది
- కృష్ణన్ నాయర్ శాంతకుమారి- ఆర్ట్స్, కేరళ
- తరుణ్ గొగోయ్ (మరణానంతరం) – ప్రజా వ్యవహారాలు, అస్సాం
- చంద్రశేఖర్ కంబ్రా – సాహిత్యం, విద్య, కర్ణాటక
- సుమిత్రా మహాజన్- ప్రజా వ్యవహారాలు, మధ్యప్రదేశ్
- నృపేంద్ర మిశ్రా, సివిల్ సర్వీస్, ఉత్తరప్రదేశ్
- రామ్ విలాస్ పాశ్వాన్ (మరణానంతరం) – ప్రజా వ్యవహారాలు, బీహార్
- కేశుభాయ్ పటేల్ (మరణానంతరం) – ప్రజా వ్యవహారాలు, గుజరాత్
- కల్బే సాదిక్ (మరణానంతరం) – ఆధ్యాత్మికత, ఉత్తరప్రదేశ్
- రజనీకాంత్ దేవిదాస్, ఇండస్ట్రీస్, మహారాష్ట్ర
- తర్లోచన్ సింగ్, ప్రజా వ్యవహారాలు, హర్యానా
రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొంటున్నారు.
Delhi: Olympian badminton player PV Sindhu awarded the Padma Bhushan pic.twitter.com/TqUldnQgr3
— ANI (@ANI) November 8, 2021
ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఆ నాలుగు విషయాలను అస్సలు ఎవరితో షేర్ చేసుకోకండి.. అవేంటంటే..