Ramnath Kovind: రాష్ట్రపతి కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతం.. వైద్యులకు అభినందనలు తెలియజేసిన రాజ్నాథ్..
President Ram Nath kovind Bypass Surgery: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతమైంది. మంగళవారం ఢిల్లీ ఎమిమ్స్లో జరిగిన ఈ ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు...
President Ram Nath kovind Bypass Surgery: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతమైంది. మంగళవారం ఢిల్లీ ఎమిమ్స్లో జరిగిన ఈ ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ.. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినందుకు వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. సర్జరీ విషయమై ఎయిమ్స్ డైరెక్టర్తో మాట్లాడి రాష్ట్రపతి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని వెల్లడించారు. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. ఛాతిలో నొప్పి ఉందన్న కారణంగా అస్వస్థతకు గురైన 75 ఏళ్ల రామ్నాథ్ను వెంటనే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. దీంతో వైద్యులు రామ్నాథ్కు బైపాస్ సర్జరీని నిర్వహించారు. రాష్ట్రపతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం.
రాజ్నాథ్ సింగ్ చేసిన ట్వీట్..
The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi.
I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji’s health. Praying for his well-being and speedy recovery.
— Rajnath Singh (@rajnathsingh) March 30, 2021