PM Modi: మంగళూరులో మోడీకి ఘన స్వాగతం.. రోడ్షోకు లక్షలాదిగా తరలివచ్చిన జనం.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
PM Modi Mangaluru Visit: ప్రధాని నరేంద్రమోడీకి కర్ణాటకలోని మంగళూరులో ఘన స్వాగతం లభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే నిమిత్తం అక్కడికి వెళ్లిన మోడీకి కన్నడీగులు సాదర స్వాగతం పలికారు.
PM Modi Mangaluru Visit: ప్రధాని నరేంద్రమోడీకి కర్ణాటకలోని మంగళూరులో ఘన స్వాగతం లభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే నిమిత్తం అక్కడికి వెళ్లిన మోడీకి కన్నడీగులు సాదర స్వాగతం పలికారు. లక్షలాది మంది రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చేతులు ఊపుతూ, హర్షధ్వానాలు చేస్తూ ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. ఈనేపథ్యంలో మోడీ మంగళూరు టూర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ పర్యటనలో మోడీ వెంట కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గోహ్లెట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు శోభాకరంద్లాజే, ప్రహ్లాద్ జోషీ, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటేల్, పలువురు మంత్రులు, తదితర బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. మంగళూరులోని గోల్డ్ ఫించ్ సిటీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 3,800 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి గానూ ఇదే వేదికగా ప్రధాని నరేంద్ర మోడీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధన్యవాదాలు తెలిపారు. ‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చాలామంది చెబుతున్నారు. అయితే దేశంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అయితే కొందరు దీనిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. కారు కూతలు కూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలోనే పలువురు మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు.
Impromptu roadshow in Mangaluru as People turned out in large numbers on the roads leading to the venue to greet PM @narendramodi.@PMOIndia pic.twitter.com/inqV6wCTBX
— DD News (@DDNewslive) September 2, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..