G7 Summit: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జీ7 సమ్మిట్లో కీలక ప్రసంగం..
G7 Summit: G7 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో జర్మనీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం మునిచ్ చేరుకున్నారు.
G7 Summit: G7 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో జర్మనీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం మునిచ్ చేరుకున్నారు. ప్రధాని మోదీ జర్మనీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇక మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పీఎంవో విడుదల చేసింది. రెండు రోజుల జర్మనీ పర్యటనలో భాగంగా.. ఇవాళ, రేపు(జూన్ 26, 27 తేదీల్లో) జరుగనున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో జీ7 భాగస్వామ్య దేశాలతో ప్రపంచ ఆహార భద్రత, ఉగ్రవాద నిరోధకం, పర్యావరణం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఇక జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జూన్ 26, 27 తేదీల్లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ప్రపంచంలోని ఏడు అత్యంత సంపన్న దేశాల సమూహం అయిన G7 సమ్మిట్కు జర్మనీ అధ్యక్షత వహిస్తోంది. కాగా, ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అనేక ద్వైపాక్షి సమావేశాల్లోనూ పాల్గొననున్నారు.
An early morning touchdown in Munich…
PM @narendramodi will participate in the G-7 Summit.
Later this evening, he will also address a community programme in Munich. pic.twitter.com/firI9zI3yo
— PMO India (@PMOIndia) June 26, 2022