రూ. 100 నాణెం విడుదల చేయనున్న ప్రధాని మోదీ
రాజమాత విజయరాజే సింధియా జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రూ. 100 నాణేన్ని విడుదల చేయనున్నారు. జనసంఘ్ నాయకురాలైన విజయరాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా.
రాజమాత విజయరాజే సింధియా జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రూ. 100 నాణేన్ని విడుదల చేయనున్నారు. జనసంఘ్ నాయకురాలైన విజయరాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. వర్చ్యువల్ గా జరిగే ఈ కార్యక్రమంలో మోదీ దీన్ని రిలీజ్ చేస్తారని, ఇందులో శ్రీమతి సింధియా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నాణేన్ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ రూపొందించింది.