PM Modi: కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం.. ఎందుకంటే..
PM Modi: కాసేపట్లో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా..
PM Modi: కాసేపట్లో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సౌతాఫ్రికా వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా కంటే ఈ న్యూ వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్వో. ఈ వేరియంట్కు ఒమిక్రాన్గా పేరు పెట్టింది.
దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ఇప్పటికే వంద కోట్లకుపైగా దాటిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్పై సమావేశం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: