PM Modi: మేం చేస్తున్న పని 99 శాతం మందికి చేరడం లేదు.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ..
మేం చేస్తున్న పని 99 శాతం మందికి చేరడం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ న్యాయవ్యవస్థ భాషాపరంగా పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తాను పనిచేస్తున్న వ్యక్తులకు చేరువ కావాలంటే వారి భాషలోనే సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రజల భాషలో వారిని సంప్రదిస్తే తప్పవారికి అసలు విషయం తెలియదన్నారు. సీజేఐ చంద్రచూడ్ ప్రసంగం వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది జరిగితే, అది చాలా మందికి సహాయపడుతుందన్నారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి భారతీయుడి భాషలో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను చేరవేయడమే మా తదుపరి లక్ష్యం’ అని అన్నారు. ఈ సమయంలో ప్రజలకు సమాచారం చేరకపోవడం, భాషా ప్రతిబంధకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ‘మన పౌరులతో వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే తప్ప, మనం చేస్తున్నది 99 శాతం ప్రజలకు చేరదన్నారు.
ప్రధాని మోదీ ప్రశంసలు
CJI డివై చంద్రచూడ్ ప్రసంగ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోదీ ఇది చాలా ప్రశంసనీయమైన ఆలోచన అని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి ట్వీట్లో ఇలా వ్రాశారు, ‘ఇటీవల ఒక కార్యక్రమంలో గౌరవనీయమైన CJI జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకోవాలని తెలిపారు. ఇది చాలా అభినందనీయమైన ఆలోచన, ఇది చాలా మందికి, ముఖ్యంగా యువతకు సహాయం చేస్తుంది.
At a recent function, the Hon’ble CJI Justice DY Chandrachud spoke of the need to work towards making SC judgments available in regional languages. He also suggested the use of technology for it. This is a laudatory thought, which will help many people, particularly youngsters. pic.twitter.com/JQTXCI9gw0
— Narendra Modi (@narendramodi) January 22, 2023
ఈ అంశంపై ప్రధాని మోదీ రెండు ట్వీట్లు చేశారు. అతను మరో ట్వీట్లో ఇలా వ్రాశారు, భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, ఇవి మన సాంస్కృతిక చైతన్యాన్ని పెంచుతాయి. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సబ్జెక్టులను మాతృభాషలోనే చదివే అవకాశం కల్పించడంతో పాటు భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం