సుడాన్‌లో ఘోర ప్రమాదం: భారతీయుల మృతి.. మోదీ విచారం..!

సుడాన్ రాజధాని ఖార్తూమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ ట్యాంకర్ పేలి.. సిరామిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. మృతి చెందిన వారిలో.. ఏకంగా.. 18 మంది భారత దేశానికి చెందినవారే. కాగా.. ఈ ప్రమాదంపై.. పీఎం నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే.. మృతులందరికీ.. సుడాన్‌లో […]

సుడాన్‌లో ఘోర ప్రమాదం: భారతీయుల మృతి.. మోదీ విచారం..!
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 8:02 AM

సుడాన్ రాజధాని ఖార్తూమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ ట్యాంకర్ పేలి.. సిరామిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. మృతి చెందిన వారిలో.. ఏకంగా.. 18 మంది భారత దేశానికి చెందినవారే. కాగా.. ఈ ప్రమాదంపై.. పీఎం నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే.. మృతులందరికీ.. సుడాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం.. సహాయ సహకారాలు అందిస్తుంది’.. అంటూ ట్వీట్ చేశారు.