PM Kisan Samman Nidhi Yojana: ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్రం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో రైతులకు నేరుగా డబ్బులు వారి బ్యాంక్ ఎకౌంట్ లోకి జమ అవుతాయి.
PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో రైతులకు నేరుగా డబ్బులు వారి బ్యాంక్ ఎకౌంట్ లోకి జమ అవుతాయి. ఈ స్కీమ్ కింద ఏడాదికి ఆరువేల రూపాయలను అందిస్తోంది మోడీ సర్కార్. అయితే ఈ సొమ్మును ఒకేసారి రైతులకు ఇవ్వరు. విడతల వారీగా సంబంధిత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల చొప్పున అందిస్తూ వస్తోంది ప్రభుత్వం. అయితే, ఇప్పుడు రావాల్సిన 8వ విడత సొమ్ములు రైతులకు రావలసి ఉంది. రైతులు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 1 లేదా ఏప్రిల్ 8 నుంచి పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఎకౌంట్లలోకి వస్తాయని చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పటి వరకూ ఈ డబ్బులు రాలేదు. దీంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. ఇప్పుడు వారి ఆందోళన తీరేలా కేంద్రం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.
పీఎం కిసాన్ స్కీమ్ కింద ఈ నెల 20 నుంచి 25 తేదీల మధ్యలో బ్యాంకు ఎకౌంట్లకు 2 వేల రూపాయలు జమ చేస్తారని చెబుతున్నారు. రైతులకు కేంద్రం ఈ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా దదాపు 11 కోట్ల మందికి ఈ 8 వ విడత డబ్బులు ఈ నెలాఖరులోగా అందే అవకాశం ఉంది.
Also Read: Viral News: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.!