PM Kisan 10th instalment: రైతులకు శుభవార్త.. డిసెంబర్ 15లోపు రైతుల ఖాతాల్లోకి రూ.2000..!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో 10వ విడత సాయం డిసెంబర్ 15 లోపు జమ చేస్తారని తెలుస్తుంది. అర్హులైన రైతులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు PM కిసాన్ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో 10వ విడత సాయం డిసెంబర్ 15 లోపు జమ చేస్తారని తెలుస్తుంది. అర్హులైన రైతులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు PM కిసాన్ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6000 నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. రూ. 2000 చొప్పున మూడు వాయిదాలలో ఈ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను కోల్పోకూడదనుకుంటే.. మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా కూడా యోజన కింద నమోదు చేసుకోవచ్చు.
PM కిసాన్ సమ్మాన్ నిధి పేరు ఇలా నమోదు చేసుకోండి
1. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు వెబ్సైట్ https://pmkisan.gov.in/. లోకి వెళ్లాలి
2. హోమ్పేజీలో మీరు ఎడమ వైపు ఫార్మర్స్ కార్నర్ని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
3. ఫార్మర్స్ కార్నర్ బాక్స్లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ ఆప్షన్పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీరు గ్రామీణ రైతా లేక పట్టణ రైతా అని ఎంచుకోండి.
5. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ను నమోదు చేసి, రాష్ట్రాన్ని ఎంచుకోండి.
6. ‘Captcha’ నమోదు చేసి OTPని క్లిక్ చేసి చేయండి.
7. మీరు ఇప్పుడు మీ ఆధార్-లింక్ చేసిన నెంబర్కి OTPని వస్తుంది.
8. OTPని నమోదు చేసిన తర్వాత, మీరు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Read Also.. PM Modi: నెట్టింట చెక్కుచెదరని మోడీ క్రేజ్.. 2021లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది మన ప్రధాని గురించే..