Covid -19 Vaccination: జోరుగా సాగుతున్న రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టాప్లో ఏ రాష్ట్రం ఉందంటే..
దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ డ్రైవ్లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు...
దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ డ్రైవ్లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. టీకా తీసుకునేవారు కోవిన్ 2.0 యాప్లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా రెండో దశ వ్యాక్సినేషన్లో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 5,187 మందికి టీకా ఇచ్చారు.
ఇక దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి వరకు 949,147 మందికి.. రెండవ దశలో 712 మిలియన్ మందికి టీకాలు వేసింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్లో రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఢిల్లీలో 1,679 మందికి టీకా వేసింది. అటు మూడవ స్థానంలో ఒడిశా నిలిచింది. మొత్తం 1,283 డోసులను వినియోగించింది. ఇక రెండవ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 270 మిలియన్ల మందికి టీకా అందించనున్నారు. దేశ రాజధానిలో రెండో దశ వ్యాక్సినేషన్లో మొదటి మూడు రోజుల్లో 33,259 మందికి టీకా వేయగా.. రోజూకు 11,000 షాట్ లకు పైగా.. రెండవ దశ ప్రారంభానికి మూడు రోజుల ముందు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్ లైన్ కార్మికులకు మాత్రమే ఈ డోసులను అందించింది. ఒడిశా తర్వాత కేరళ రాష్ట్రంలో 1,220 మిలియన్ టీకాలను అందించగా..చత్తీ్స్ ఘర్ లో 1,057 టీకాలను అందించింది. ఢిల్లీలో సగటున రోజుకు 19,176 షాట్లను సాధించింది. ఇక రెండో దశలో దేశవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 316,382 మందికి టీకా అందించింది.
ఇదిలా ఉండగా.. అత్యంత తక్కువ టీకాలను అందించిన రాష్ట్రంగా బీహార్ నిలిచింది. రెండో దశలో మొదటి మూడు రోజులలో తక్కువ మందికి మాత్రమే టీకా వేసింది. ఇప్పటివరకు 43 మిలియన్ల టీకాలను మాత్రమే అందించింది. 60 మిలియన్లతో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లో మిలియన్ కు 144 షాట్లు అందించింది. అలాగే హర్యానాలో 192 మిలియన్ టీకాలు అందించగా.. ఆంధ్రప్రదేశ్ లో 198 మిలియన్ టీకాలను అందించింది. బుధవారం సాయంత్రం వరకు భారతదేశం అంతటా 949,147 మందికి ఈ విభాగంలో షాట్లు వచ్చాయి. జనవరి 16న ప్రారంభమైన ఈ డ్రైవ్ మొదటి దశలో 13 రెట్లు ఎక్కువ (13.5 మిలియన్ల మంది, లేదా మిలియన్ జనాభాకు 10,118) టీకా ఇవ్వడం జరిగింది. ఆగస్టు నాటికి 300 మిలియన్ల మందికి రోగనిరోధక శక్తినిచ్చే లక్ష్యంగా కృషిచేస్తుంది కేంద్రం.
టాప్ 5 రాష్ట్రాలు..
రాజస్థాన్ – 5,187 ఢిల్లీ -1,679 ఒడిశా -1,283 కేరళ – 1,220 చత్తీస్ ఘర్ -1,057
తక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు..
ఆంధ్రప్రదేశ్ -198 హర్యానా -192 జార్ఖాండ్ -144 ఉత్తర్ ప్రదేశ్ -60 బీహార్ – 43 నేషనల్ అవరేజ్ – 712
Also Read:
Kerala Gold Scam: కేరళలో గోల్డ్ స్కామ్ ప్రకంపనలు.. కేరళ సీఎం విజయన్పై సంచలన ఆరోపణలు