Amritsar: అందరూ గాఢ నిద్రలో ఉండగా కంపించిన భూమి.. భయంతో జనం పరుగులు..
ఉత్తర భారతాన్ని వరస భూకంపాలు వణికిస్తున్నాయి. హిమాలయ సీమలో వస్తున్న భూ ప్రకంపనలు కలవరపెడుతున్నాయి. నేపాల్, ఢిల్లీ లో వచ్చిన భూకంప ఘటనలను మరవకముందే మరోసారి పంజాబ్ ను భూకంపం వణికించింది...
ఉత్తర భారతాన్ని వరస భూకంపాలు వణికిస్తున్నాయి. హిమాలయ సీమలో వస్తున్న భూ ప్రకంపనలు కలవరపెడుతున్నాయి. నేపాల్, ఢిల్లీ లో వచ్చిన భూకంప ఘటనలను మరవకముందే మరోసారి పంజాబ్ ను భూకంపం వణికించింది. అమృత్ సర్ లో సోమవారం తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో 3.42 గంటలకు భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమి నుంచి 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్ దేశంలో వచ్చిన భూకంపాలతో ఉత్తరాఖండ్, ఢిల్లీ ఇతర పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి ప్రజలు పరుగులు తీశారు. శనివారం రాత్రి 8 గంటలకు నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే.. హిమాలయాల్లో ఎప్పుడైనా భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి కేవలం ట్రయల్ మాత్రమేనని అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. నాలుగు రోజుల్లో రెండోసారి భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధి, ఘజియాబాద్, నోయిడాలో, చాలా చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. మరోవైపు ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలో భూమి కంపించిన విషయం రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రత నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..