narada case: బీజేపీ నేత సువెందు అధికారిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు ? నారదా టేప్స్ సూత్రధారి మాథ్యూస్ శామ్యూల్
ఒకనాటి నారదా బ్రైబరీ కేసు నేడు పశ్చిమ బెంగాల్ ను వణికిస్తోంది. ఈ కేసులో ఇంకా పెద్ద తలకాయలు చాలా ఉన్నాయని, నేడు జరిగిన అరెస్టులు సముద్రంలో ఒక్క బొట్టు మాత్రమేనని అన్నారు ఈ కేసులో కంప్లయినెంట్, ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్ మాథ్యూ శామ్యూల్.....
ఒకనాటి నారదా బ్రైబరీ కేసు నేడు పశ్చిమ బెంగాల్ ను వణికిస్తోంది. ఈ కేసులో ఇంకా పెద్ద తలకాయలు చాలా ఉన్నాయని, నేడు జరిగిన అరెస్టులు సముద్రంలో ఒక్క బొట్టు మాత్రమేనని అన్నారు ఈ కేసులో కంప్లయినెంట్, ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్ మాథ్యూ శామ్యూల్.. నారదా లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే సువెందు అధికారిని సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు., నారదా న్యూస్ ఫౌండర్ కూడా అయిన ఈయన..బెంగాల్ లో సోమవారం జరిగిన అరెస్టులు చాలా స్వల్ప మాత్రమే అని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్ వంటి మంత్రులను అరెస్టు చేయడంపట్ల ఆయన హర్షం ప్రకటించారు. లోగడ మాథ్యూ శామ్యూల్ ఆధ్వర్యంలోనే ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. కానీ ఇదే కేసులో సువెందు అధికారిని అరెస్టు చేయలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు గడిచాయి. 2016 లో స్టింగ్ ఆపరేషన్ టేప్స్ విడుదల అయ్యాయి. కానీ పొలిటిషియన్లను సీబీఐ టచ్ చేయలేదు.. మూడేళ్ళ క్రితమే వీరిపై ఛార్జి షీట్ దాఖలయింది అని శామ్యూల్ పేర్కొన్నారు. 2016 లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముడుపులు తీసుకున్న తృణమూల్ నాయకులు పలువురి ఫోటోలను, వీడియో రికార్డింగులతో సహా నారదా న్యూస్ ప్రచురించింది. వీటినే నారదా టేప్స్ గా వ్యవహరించారు. సువెందు అధికారితో బాటు ముకుల్ రాయ్ వంటి నేతల ప్రమేయం కూడా ఈ వ్యవహారంలో ఉంది. నాడు తానే అధికారి కార్యాలయానికి వెళ్లి డబ్బులు ఇఛ్చి వచ్చానని శామ్యూల్ తెలిపారు. మొదట సీఎం మమతకు సన్నిహితుడిగా ఉన్న అధికారి ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇలాంటి నాయకులపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని శామ్యూల్ ప్రశ్నించారు. సీబీఐ తననుంచి స్టేట్ మెంట్ కూడా తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Shekar Master: డ్యాన్సర్లందరికీ నేనున్నా… ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా… ( వీడియో )
Viral Video: ఆకాశం నుంచి ఎలుకల వర్షం వట్టి భ్రమేనా..?? అసలు విషయమేమిటంటే… ( వీడియో )