బోల్తా పడ్డ పోలీస్ వాహనం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..
యూపీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కాన్పూర్కు చెందిన ఓ పోలీస్ వాహనం ఝాన్సీ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు..
యూపీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కాన్పూర్కు చెందిన ఓ పోలీస్ వాహనం ఝాన్సీ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఝాన్సీకి సమీపంలో పోలీసులు వెళ్తున్న వాహనం టైర్ పంక్చర్ అవ్వడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాల పాలైన నలుగురిని ఝాన్సీలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలు విడిచారని వైద్యులు తెలిపారు. మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని.. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలిస్తామని వైద్యులు తెలిపారు.
Jhansi: One police personnel dead and 3 personnel severely injured after a vehicle of Kanpur police overturned yesterday. The 3 injured are admitted to a hospital in Jhansi. Six personnel were present in the vehicle, two of them sustained minor injuries and were taken to Kanpur.
— ANI UP (@ANINewsUP) July 18, 2020