పార్టీ కార్యకర్తలకు రక్షణగా దూసుకువెళ్లిన ప్రియాంక గాంధీ

ఢిల్లీ-నోయిడా ఫ్లైఓవర్ టోల్ ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హత్రాస్ కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు..

పార్టీ కార్యకర్తలకు రక్షణగా దూసుకువెళ్లిన ప్రియాంక గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2020 | 7:34 PM

ఢిల్లీ-నోయిడా ఫ్లైఓవర్ టోల్ ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హత్రాస్ కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వీరిని ఖాకీల బారి నుంచి కాపాడేందుకు పార్టీ నేత ప్రియాంక గాంధీ ముందుకు దూసుకు వెళ్లి వారికి రక్షణగా నిలబడేందుకు యత్నించారు.  ముఖ్యంగా లాఠీచార్జీలో గాయపడిన ఓ కార్యకర్తను ఖాకీల నుంచి రక్షించడానికి ఆమె నానా పాట్లు పడ్డారు. ముఖానికి మాస్క్, డార్క్ బ్లూ కుర్తా ధరించిన ప్రియాంక..చిన్న బ్యారికేడ్ ను తొలగించుకుని పరుగులు తీశారు. తోపులాటలు, ఘర్షణలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ గందరగోళంలో కొందరు కెమెరామెన్లు కూడా స్వల్పంగా గాయపడ్డారు.