Amit Shah Missing: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్ అయ్యారు!.. ట్విట్టర్లో హోరెత్తుతున్న హ్యాష్ ట్యాగ్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు..
Amit Shah Missing: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్ అయ్యారు. అవును.. మీరు విన్నది నిజమే.! అదేంటీ.. మొన్నే కదా ఐదు రాష్ట్రాల ఎన్నికల..
Amit Shah Missing: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్ అయ్యారు. అవును.. మీరు విన్నది నిజమే.! అదేంటీ.. మొన్నే కదా ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు మిస్ అయ్యారు అంటున్నారేంటి? అని సందేహిస్తున్నారా? అయితే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. అమిత్ షా మిస్సింగ్ అంటూ ట్విట్టర్లో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. అమిత్ షా మిస్సింగ్ పేరుతో పెద్ద ఎత్తున పోస్టులు షేర్ అవుతున్నాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి చెందిన కొందరు వ్యక్తులు అమిత్ షా మిస్సింగ్ అనే యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు. దాంతో అదికాస్తా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా కేంద్ర హోంమంత్రి మాత్రం కనిపించకుండా పోయారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకెళితే.. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్షా జాడ తెలియడం లేదంటూ ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్ కరియప్ప ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న సంక్షోభ సమయంలో సహాయక చర్యలు చేయడం అటుంచి అమిత్షా కనిపించకుండా పోయారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ట్వీట్టర్లోనూ తన ఫిర్యాదు ప్రతిని పోస్ట్ చేశాడు. కాగా, నాగేశ్ కరియప్ప ఫిర్యాదును స్వీకరించినట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాల్సి ఉందని, సంక్షోభ పరిస్థితుల్లో నుంచి పారిపోకూడదని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు ఇచ్చిన ఫిర్యాదులో నాగేశ్ కరియప్ప పేర్కొన్నారు. ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో.. భారత ప్రభుత్వం, బీజేపీకి మాత్రమే కాకుండా దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడం రాజకీయ నాయకుల కర్తవ్యం అని పేర్కొన్నారు.
Also read:
COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. లాటరీ ఫ్రీ.. మిలియన్ డాలర్ల బహుమానం.. ఎక్కడంటే?
Mobile Games: లాక్డౌన్లో బోర్ ఫీల్ అవుతున్నారా.? ఈ టాప్ 5 మొబైల్ గేమ్స్ మీకోసమే.! ఓ లుక్కేయండి..