రియాకు క్లీన్ చిట్ ఇవ్వలేదు, ముంబై పోలీసుల క్లారిటీ

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని ముంబై పోలీసులు తెలిపారు. ఆమెను తాము ఇంకా అనుమానితురాలిగానే..

రియాకు క్లీన్ చిట్ ఇవ్వలేదు, ముంబై పోలీసుల క్లారిటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 8:17 PM

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని ముంబై పోలీసులు తెలిపారు. ఆమెను తాము ఇంకా అనుమానితురాలిగానే పరిగణిస్తున్నామన్నారు. అభిషేక్ త్రిముఖి అనే పోలీసు అధికారితో రియా రెండు సార్లు ఫోన్ లో మాట్లాడిందని, ఆయన కూడా ఆమెతో రెండు సార్లు మాట్లాడాడని వారు వెల్లడించారు. రియా ఫోన్ కాల్ డీటెయిల్స్  ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. ఆ అధికారి నుంచి ఆమెకు ఈ-మెయిల్ అందిందని, దాంతో రియా..తనకు తెలిసిన సమాచారమంతా వివరిస్తానని ఆయనకు బదులిచ్చిందన్నారు. అయితే ఈ ఈ-మెయిల్ కి సంబంధించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు వారు చెప్పారు. తన కుమారుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా చక్రవర్తే కారణమని సుశాంత్ తండ్రి ఆరోపించిన విషయం గమనార్హం.