నిర్భయ కేసు.. దోషి పవన్ క్యురేటివ్ పిటిషన్ పై రేపు విచారణ
నిర్భయ కేసులో నలుగురు దోషులనూ ఉరి తీసేందుకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. వీరి ఉరిపై స్టే విధించాలంటూ వీరి తరఫు లాయర్ ఏపీ సింగ్.
నిర్భయ కేసులో నలుగురు దోషులనూ ఉరి తీసేందుకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. వీరి ఉరిపై స్టే విధించాలంటూ వీరి తరఫు లాయర్ ఏపీ సింగ్.. బుధవారం ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తరఫున క్యురేటివ్ పిటిషన్, మరో దోషి అక్షయ్ తరఫున మెర్సీ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలై ఉన్నాయన్నారు. (నేరం జరిగినప్పుడు తను మైనర్నని పవన్ మళ్ళీ తన క్యురేటివ్ పిటిషన్ లో పేర్కొన్నాడు). కాగా.. తన రెండో క్షమాభిక్ష పిటిషన్ ను మళ్ళీ నిన్న రాష్ట్రపతికి పంపినట్టు అక్షయ్ తెలిపాడు. పవన్ పిటిషన్ పై గురువారం విచారణ జరగాలని కోర్టు పేర్కొంది. ఇలా నిర్భయ కేసులో దోషులు నలుగురూ తమ ఉరిశిక్షలను తప్పించుకోవడానికి వివిధ మార్గాలను వెతుకుతున్నారు. ఢిల్లీ కోర్టు, సుప్రీంకోర్టు కూడా వీరి వాదనల విషయంలో ఖఛ్చితమైన తీర్పు వెలువరించకుండా జాప్యం చేస్తుండడంపై నిర్భయ తల్లి ఆశాదేవి విచారం వ్యక్తం చేస్తున్నారు.