దేశంలో ఉగ్రదాడికి ప్లాన్ : తమిళనాడులో ముమ్మర గాలింపు
తమిళనాడులో ఎన్ఐఏ తనిఖీలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా.. రాష్ట్రంలోని చెన్నై, మధురై, తేని, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంజారుల్లా తీవ్రవాద సంస్థకు సంబంధించిన నిధిని సేకరించినందుకు గానూ.. ఇటీవల 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవాళ వీరికి సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన నలునగురిని ఇటీవల ఎన్ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్చేశారు. గత వారం రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో […]
తమిళనాడులో ఎన్ఐఏ తనిఖీలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా.. రాష్ట్రంలోని చెన్నై, మధురై, తేని, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంజారుల్లా తీవ్రవాద సంస్థకు సంబంధించిన నిధిని సేకరించినందుకు గానూ.. ఇటీవల 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవాళ వీరికి సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు.
దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన నలునగురిని ఇటీవల ఎన్ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్చేశారు. గత వారం రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 16 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు. అంజారుల్లా.. అనే తీవ్రవాద సంస్థ నుంచి భారీగా నిధులు సేకరించినట్లు గుర్తించారు. దీంతో.. మన్నడిలో సయ్యద్ బుహారీ, మంజకొల్లైలో హరీష్, మహమ్మద్ అలీ, సిక్కల్లో హాసన్ అలీలను కూడా రెండ్రోజుల క్రితం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
కాగా.. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 16 మందికి చెన్నై సమీప పూందమల్లి మేజిస్ట్రేట్ కోర్టు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంలో విచారణ ప్రారంభించిన అధికారులు.. ఈ ఉగ్రవాద సంస్థతో ఇంకా ఎవరెవరికి.. సంబంధాలు అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.