నేతాజీ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్..! ఆ బాబా బోస్ కాదని చెప్పే నివేదిక అదృశ్యం..
ప్రపంచంలోనే ఇంతటి సస్పెన్స్ ఎక్కడా ఉండదు కాబోలు. దేశ స్వాతంత్ర సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకోల్పి.. బ్రిటీష్ వారిని ఎదుర్కొనేందుకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన మరెవరో కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే ఆయన జన్మదినం తప్పితే.. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు మరణించారన్నది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయింది. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని వార్తలు […]
ప్రపంచంలోనే ఇంతటి సస్పెన్స్ ఎక్కడా ఉండదు కాబోలు. దేశ స్వాతంత్ర సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకోల్పి.. బ్రిటీష్ వారిని ఎదుర్కొనేందుకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన మరెవరో కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే ఆయన జన్మదినం తప్పితే.. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు మరణించారన్నది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయింది. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని వార్తలు వచ్చినా.. అవన్నీ ఫేక్ అని.. రష్యాలో జైలు జీవితం గడిపి.. ఆ తర్వాత అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి…గుమ్నామీ బాబాగా జీవించారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ గుమ్నామీ బాబానే నేతాజీ అని వాదన వినిపించడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
గుమ్నామీ బాబాయే నేతాజీ అన్న వాదన సరైంది కాదని.. తాజాగా ఓ కమిషన్ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన ఓ నివేదికను ఉత్తర్ప్రదేశ్ శాసనసభకు సమర్పించింది. అయితే, ఆ సమర్పించిన నివేదికలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(సీఎస్ఎఫ్ఎల్) అందించిన ఎలక్ట్రోఫీరోగ్రామ్ నివేదిక ఆధారంగానే.. గుమ్నామీ బాబానే నేతాజీ కాదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. అయితే ఈ నివేదికపై సాయక్ సేన్ అనే బోస్ అభిమాని ఒకరు ఎలక్ట్రోఫీరోగ్రామ్ నివేదిక ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన సీఎస్ఎఫ్ఎల్ కోల్కతా.. తమ వద్ద ఆ నివేదిక లేదని చేతులెత్తేసింది. ఆ నివేదిక కావాలంటే సీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అయితే నేతాజీ అదృశ్యంపై నిజాలేంటో బహిర్గతం చేసేందుకు యూపీ సర్కార్.. జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్ని నియమించింది. దీనిపై విచారణ జరిపిన వారు.. గుమ్నామీ బాబా వాడిన వస్తువులు, బాబా దంతంపై సీఎస్ఎఫ్ఎల్ కోల్కతా జరిపిన ఎలక్ట్రోఫీరోగ్రామ్ నివేదికలో నేతాజీ, బాబా ఒకరు కాదని తేల్చింది. కానీ, తాజాగా ఇప్పుడు అలాంటి నివేదిక తమ వద్ద లేదని సీఎస్ఎఫ్ఎల్ చెప్పడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
సహాయ్ కమిషన్ 2005 నాటి ముఖర్జీ కమిషన్ రిపోర్టు ఆధారంగానే నివేదిక సమర్పించిందంటూ ఆర్టీఐ యాక్టివిస్ట్ సాయక్ సేన్ ఆరోపిస్తున్నారు. ముఖర్జీ కమిషన్ రిపోర్టులో ఎలక్ట్రోఫీరోగ్రామ్ లేదని.. ఇది డీఎన్ఏ పరిశీలనకు అత్యవసరమని.. ఆ రిపోర్టును కావాలనే ప్రభావితం చేశారని ఆరోపిస్తున్నారు.
అయితే ఈ హాట్టాపిక్పై నేతాజీ మనవడు, బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ స్పందించారు. సాయక్ సేన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. సీఎస్ఎఫ్ఎల్ కేవలం నివేదిక తమ వద్ద లేదని మాత్రమే చెప్పిందని.. అంతమాత్రాన నివేదికే లేదనడం సరైంది కాదన్నారు. మరి అసలు నిజాలు ఇంకా ఎప్పుడు బయటపడతాయో వేచి చూడాల్సిందే.