ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త సీజేలు.. దేశ వ్యాప్తంగా 14 మంది బదిలీ
ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై వస్తుండగా, ఐదుగురు న్యాయమూర్తులు సీజేగా పదోన్నతి....
ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై వస్తుండగా, ఐదుగురు న్యాయమూర్తులు సీజేగా పదోన్నతి లభించింది. మరో హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్స్ చేసింది.
బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు..
హైకోర్టులలో పని చేస్తున్న ప్రధాన న్యాయమూర్తులు పలు రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తెలంగాణ నుంచి ఉత్తరాఖండ్కు బదిలీ అయ్యారు. ఏపీలో పని చేస్తున్న జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రస్తుతం సిక్కింకు బదిలీ అయ్యారు. ఒడిశాలో పని చేస్తున్న జస్టిస్ మహమ్మద్ రఫీఖ్ మధ్యప్రదేశ్కు బదిలీ అయ్యారు. సిక్కిం జస్టిస్గా పని చేస్తున్న అరూప్ కుమార్ గోస్వామి ఏపీకి బదిలీ అయ్యారు.
సీజేలుగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు.. కాగా, పలు హైకోర్టులలో పని చేస్తున్న జస్టిస్లు సీజేలుగా పదోన్నతి లభించింది. ఢిల్లీలో పని చేస్తున్న జస్టిస్ హిమా కోహ్లి తెలంగాణకు బదిలీ అయ్యారు. పంజాబ్ లో పని చేస్తున్న జస్టిస్ ఎస్. మురళీధ్ హర్యానాకు బదిలీ అయ్యారు. కోల్కత్తాలో పని చేస్తున్న జస్టిస్ సంజీబ్ బెనర్జీ మద్రాస్కు బదిలీ అయ్యారు. అలహాబాద్లో పని చేస్తున్న జస్టిస్ పంకజ్ మిత్రల్ జమ్మూకశ్మర్కు బదిలీ అయ్యారు. ఉత్తరాఖండ్ హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ సుధాంశు ధులియా పదోన్నతిపై గౌహతికి బదిలీ అయ్యారు.
బదిలీ అయిన న్యాయమూర్తులు.. కోల్ కత్తా హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ బోయ్మాల్య బాగ్చి ఏపీకి బదిలీపై అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ సంజయ్ యాద్ అలహాబాద్కు బదిలీ అయ్యారు. జమ్మూలో హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ రాజేష్ బిందాల్ కోల్కత్తాకు బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్జస్టిస్ వినీత్ కొఠారి గుజరాత్కు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ సతీష్ చంద్రశర్మ కర్ణాటకకు బదిలీ అయ్యారు.