Shashi Tharoor: సోషల్ మీడియాలో ఎంపీ శశి థరూర్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ప్రజా సమస్యలపై స్పందించాలంటూ కామెంట్లు..
కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ బుధవారం మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకున్న హర్నాజ్ కౌర్ సంధును కలిశారు...
కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ బుధవారం మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకున్న హర్నాజ్ కౌర్ సంధును కలిశారు. ఆమె విజయంపై అభినందనలు తెలిపారు. డిసెంబర్ 13న ఇజ్రాయెల్లోని ఐలాట్లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీలో పంజాబ్ చెందిన హర్నాజ్ కౌర్ సంధు విజేతగా నిలిచింది.
శశి థరూర్ బుధవారం హర్నాజ్ సంధుతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ” మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధును వ్యక్తిగతంగా కలిసి అభినందించడం ఆనందంగా ఉంది. ఆమెకు స్వాగతం పలుకుతున్నాం.” అని శశిథరూర్ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన హర్నాజ్ కౌర్ మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడం చాలా గౌరవంగా ఉంది.. మీ మంచి మాటలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.
Delighted to congratulate Miss Universe @HarnaazKaur Sandhu in person on her triumphant return to India. She’s excited to be back in India for the New Year holidays & India, of course, is proud to welcome her. She’s just as poised & charming in person as on the stage. pic.twitter.com/OBj0KeTkoQ
— Shashi Tharoor (@ShashiTharoor) December 15, 2021
అయితే శశి థరూర్ హర్నాజ్ కౌర్ సంధును కలవడం.. ఆ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో నెటిజన్లు డిఫెరెంట్గా స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడం మానేసి శశి థరూర్ను సెలబ్రెటిలను కలవడం ఏంటాని ప్రశ్నిస్తున్నారు. ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో లేవనెత్తాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.