కరోనా ఫ్రీ దేశంగా చెప్పుకున్న నేపాల్ పర్యాటక మంత్రికే సోకిన వైరస్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ నేపాల్ పర్యాటకశాఖ మంత్రి యోగేశ్ భట్టారాయ్ గొప్పలకు పోయారు.. కరోనా వైరస్ అనేది లేని దేశంగా నేపాల్ ఉంటుందని చెప్పుకొచ్చారు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ నేపాల్ పర్యాటకశాఖ మంత్రి యోగేశ్ భట్టారాయ్ గొప్పలకు పోయారు.. కరోనా వైరస్ అనేది లేని దేశంగా నేపాల్ ఉంటుందని చెప్పుకొచ్చారు.. ఫిబ్రవరిలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారాయన! పాపం ఆయనకే ఇప్పుడు కరోనా వైరస్ సోకింది.. నేపాల్లో కరోనా అంటుకున్న తొలి మంత్రి ఈయనే కావడం విధి వైపరిత్యం.. తనకు కరోనా నిర్ధారణ అవ్వగానే యోగేశ్ అప్రమత్తమయ్యారు.. తనతో క్లోజ్గా మెలిగినవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. నేపాల్ ప్రధానమంత్రి కేపీశర్మకు యోగేశ్ అత్యంత సన్నిహితులు.. ఇప్పటికే ప్రధానమంత్రి సన్నిహితులలో ఎనిమిది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.. ప్రధాని పర్సనల్ డాక్టర్, ఫోటోగ్రాఫర్, మీడియా ఎక్సపర్ట్లు కూడా ఈ చిట్టాలో ఉన్నారు. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి అప్పుడేదో యోగేశ్ అలా అని ఉంటారు.. ఇప్పుడాయనకు కరోనా తీవ్రత ఎలా ఉంటుందో అర్థమయ్యి ఉంటుంది.. కరోనా నిర్ధారణ కావడానికి ఓ రోజు ముందు యోగేశ్ భట్టారాయ్ భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సమావేశం అయ్యారు.. అప్పుడు యోగేశ్ మొహానికి కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు.. దీంతో వినయ్ మోహన్ కూడా హోం ఐసోలేషన్లోకి వెళ్లారు..