National Herald Case: మరోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ.. కాంగ్రెస్ నేతలకు నో పర్మిషన్..!
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ (ED) ముందు హాజరు కానున్నారు. దీంతో దేశ..
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ (ED) ముందు హాజరు కానున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాల దగ్గర కాంగ్రెస్ ప్రదర్శనలు నిర్వహిస్తుండగా, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద నేతల సభ నిర్వహించనున్నారు. సోనియా గాంధీ ఉదయం 11:30 గంటలకు ఈడీ ఎదుట హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోనియాగాంధీని ప్రశ్నించే అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసనలు తెలుపుతూ మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం కోసం ఇలా చేస్తోందని ఆరోపిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ప్రదర్శనకు దిగారు. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం కూడా పార్టీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు.
ప్రదర్శనకు నో పర్మిషన్..
సోనియా గాంధీ నివాసం 10 జనపథ్ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఆదేశించారు పార్టీ నేతలు. అయితే, పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యాలయాల్లో గుమిగూడి నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించడం లేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఈరోజు ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
జూలై 21న 2 గంటల పాటు విచారణ
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి జూలై 21న ఈడీ సోనియా గాంధీని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించింది. గత నెల జూన్లో రాహుల్ గాంధీని సుమారు 50 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. అప్పుడు కూడా కాంగ్రెస్ వరుసగా 5 రోజుల పాటు నిరసన ప్రదర్శన చేపట్టింది. మోడీ ప్రభుత్వం కావాలనే సోనియాగాంధీపై ఇలా చేస్తోందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి