పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.?

దాయాది పాకిస్థాన్‌తో చర్చలకంటే యుద్ధమే కరెక్ట్ అనే దిశగా మోదీ సర్కార్ ఒక్కో అడుగు వేస్తున్నట్లు సమాచారం. గత పాలకుల చేతకానితనం వల్ల ఇప్పటివరకు ఆత్మరక్షణలో పడుతూ వచ్చిన ఇండియా.. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మోదీ పుణ్యమా అని పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.. పీవోకేను సొంతం చేసుకోవడానికి నయా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాక్ ఆక్రమించిన పీవోకేను భారత్ సొంతం […]

పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.?
Follow us

|

Updated on: Oct 09, 2019 | 2:19 AM

దాయాది పాకిస్థాన్‌తో చర్చలకంటే యుద్ధమే కరెక్ట్ అనే దిశగా మోదీ సర్కార్ ఒక్కో అడుగు వేస్తున్నట్లు సమాచారం. గత పాలకుల చేతకానితనం వల్ల ఇప్పటివరకు ఆత్మరక్షణలో పడుతూ వచ్చిన ఇండియా.. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మోదీ పుణ్యమా అని పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.. పీవోకేను సొంతం చేసుకోవడానికి నయా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

పాక్ ఆక్రమించిన పీవోకేను భారత్ సొంతం చేసుకుంటుందని.. త్వరలోనే భారత త్రివర్ణ పతాకం అక్కడ ఎగురుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  మొదలుగుని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్ తదితరులు వరుసగా ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా భారత్ తీరుతో పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. కశ్మీర్ విషయంపై నోరు మెదపడం అటుంచి.. తాము ఆక్రమించిన ముజఫర్ నగర్‌ను కాపాడుకోవడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తోంది.

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. దానికి తగ్గట్టుగానే దాయాది దేశం ఊహించని విధంగా ఎదురుదాడి చేసేందుకు మోదీ సర్కారు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పాక్ ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిందని సమాచారం. ఇక పీవోకేను సొంతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నా.. సరైన తరుణం కోసం వేచి చూస్తోందన్న మాట వినిపిస్తోంది. పుల్వామా తరహాలో పాక్ ఏదైనా కవ్వింపు చర్యకు పాల్పడితే.. పీవోకేపై భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ మద్దతును కూడా మోదీ సర్కారు కూడగడుతోందట.

ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అంతర్జాతీయంగా చాలా విమర్శలు ఎదుర్కుంటోంది.. అంతేకాక ఆర్ధికంగా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించటం తెలిసిందే. ఈ ఘటనకు పాక్ నుంచి సరైన ప్రతిస్పందన లేకపోవటంతో భారత్ మరింత ధైర్యాన్ని పుంజుకుందన్న మాట వినిపిస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా మోదీ సర్కారు పీవోకే‌ భారత అంతర్భాగమని వాదిస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజాగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలం అవసరమయ్యే ఆయుధాల కొనుగోళ్లను పక్కన పెట్టిన భారత్.. తక్షణం యుద్ధం వస్తే అవసరమయ్యే ఆయుధాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం వెనుక అసలు విషయం.. పీవోకేను సొంతం చేసుకోవటమే అని తెలుస్తోంది.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!