ఈ స్మార్ట్ బ్యాండ్ వేసుకుంటే మీకు ఏ అనారోగ్యం ఉన్నా వెంటనే చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా?
వెనుకబడిన జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా అటవీ పరిసర
వెనుకబడిన జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాల్లో జీవించే గిరిజనులు ఈ విషయంలో చాలా అవస్థలు పడుతుంటారు. ఆ పరిస్థితుల్లో వారిని ఆస్పత్రికి తరలించే లోపే వారికి ఏమైనా జరగవచ్చు. అయితే ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో మైసూరుకు చెందిన దీప్తి ఘనాపాటి హెగ్డే.. కొవిడ్ 19 సింప్టమ్స్తో పాటు పదిరకాల శరీర రుగ్మతలను ముందుగానే తెలుసుకునే డివైజ్ను రూపొందించింది. ఇందుకు గాను ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించడంతో పాటు రూ.25వేల నగదు బహుమతి కూడా అందుకుంది.
సాధారణంగా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు జబ్బు చేస్తే.. వైద్యులు, ఆస్పత్రులు అందుబాటులోలేక ఎన్ని అవస్థలు పడతారో తెలిసిందే. అందుకే గ్రామీణ ప్రజల ‘పర్సనల్ సెన్సార్ డేటా’ను సేకరిస్తూ బాడీ టెంపరేచర్, బీపీఎమ్, కాఫ్, కోల్డ్ వంటి కొవిడ్ సింప్టమ్స్తో పాటు గుండె పనివిధానంలో వచ్చే మార్పులు, గర్భిణుల్లో తలెత్తే అనారోగ్యాలను ముందుగానే గుర్తించి, సదరు వ్యక్తులను అలర్ట్ చేసేలా దీప్తి స్మార్ట్ బ్యాండ్ను రూపొందించింది. మొబైల్ యాప్తో లింక్ చేసుకుంటే బ్యాండ్ పెట్టుకున్న వ్యక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే అలర్ట్ నోటిఫికేషన్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్యులు, అంబులెన్స్కు సమాచారం అందించడంతో పాటు లైవ్ లోకేషన్ షేర్ చేస్తుంది. మైసూరులోని బేస్ పీయూ కాలేజీలో ఫస్ట్ పీయూసీ చదువుతున్న 17 ఏళ్ల దీప్తి ‘బిల్డింగ్ సెల్ఫ్ రిలియంట్ స్మార్ట్ విలేజెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్’ అనే కాన్సెప్ట్ మీద ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ (ఐఐఎస్ఎఫ్)లో ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసింది. ఇందులో 3వేల మంది పార్టిసిపేట్ చేయగా, దీప్తి తొలి స్థానంలో నిలిచి ప్రైజ్మనీ దక్కించుకుంది.