చిరు వ్యాపారులు, మధ్యతరగతికి మోదీ భారీ ప్యాకేజ్.!
కరోనా భూతం మొత్తం వ్యవస్థల్ని కుదేలు చేసిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారతప్రభుత్వం ఇప్పటికే ఒక ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. మేనెలలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల..
కరోనా భూతం మొత్తం వ్యవస్థల్ని కుదేలు చేసిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారతప్రభుత్వం ఇప్పటికే ఒక ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. మేనెలలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల మేర ప్యాకేజ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఉద్దీపన ప్యాకేజ్ను ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేపడుతోంది. మధ్యతరగతి, చిన్నవ్యాపారులను ఆదుకోవడంపై ఈసారి దృష్టిసారించింది. లాక్డౌన్ ముగియడంతో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు, సేవలు అందుబాటులోకి రావడంతో తాజా ప్యాకేజ్తో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. పండుగల సీజన్ రాబోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిమాండ్ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ రంగాల్లో డిమాండ్ విపరీతంగా పడిపోయిన క్రమంలో డిమాండ్ను పెంచే చర్యలు చేపట్టాలని భావిస్తోంది. మధ్యతరగతి వర్గంతో పాటు చిన్నవ్యాపారాలకు ఊతమివ్వాలని నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధికారులు ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్టు సమాచారం.