ప్రధాని మోదీ ప్రస్తావించిన ఆ ‘సైనిక శునకం’ ఇదే !
ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఓ సాహసోపేతమైన 'సైనిక శునకం' గురించి ప్రస్తావించారు. అదే 'సోఫీ' అనే జాగిలం.. ఢిల్లీలో దుండగులు లేదా ఉగ్రవాదులు రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను..
ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఓ సాహసోపేతమైన ‘సైనిక శునకం’ గురించి ప్రస్తావించారు. అదే ‘సోఫీ’ అనే జాగిలం.. ఢిల్లీలో దుండగులు లేదా ఉగ్రవాదులు రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను, కెమికల్స్ ను పసిగట్టడంలో సోఫీ అత్యంత చురుగ్గా ఉండేదట.. దీని సేవల వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని సైనికవర్గాలు పేర్కొన్నాయి. ఈ శునకానికి ఈ నెల 15 న ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్’ పురస్కారాన్ని ప్రకటించారు. అలాగే ‘విదా’ అనే మరో ఆర్మీ డాగ్ కూడా ఈ మధ్య కృషియల్ ఆపరేషన్స్ లో పాల్గొంది. దీనికి కూడా ఇదే పురస్కారాన్ని ప్రకటించారు. ఇది భూమిలో దాచిన 5 మందు పాతరలను, ఓ బాంబును కనిపెట్టిందని మిలిటరీ వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని మోదీ ఈ జాగిలాల గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.