మాయావతి నిర్ణయంపై ప్రియాంక ఫైర్
మాయావతి నిర్ణయంపై ప్రియాంకా వాద్రా విరుచుకుపడ్డారు. చైనా విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని మాయావతి ప్రకటించిన...
మాయావతి నిర్ణయంపై ప్రియాంకా వాద్రా విరుచుకుపడ్డారు. చైనా విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని మాయావతి ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్-చైనా అంశంపై బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని హితవు పలికారు. ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.
అయితే మాయావతి ప్రకటనపై ప్రియాంకా వాద్రా అగ్గిబుగ్గయ్యారు. భారత్ తన భూభాగాన్ని కోల్పోతోందని ఆరోపించిన ప్రియాంక.. ఈ సమయంలో కేంద్రానికి మద్దతెలా పలుకుతారని మయాను ప్రశ్నించారు.
जैसे कि मैंने कहा था कि कुछ विपक्ष के नेता भाजपा के अघोषित प्रवक्ता बन गए हैं, जो मेरी समझ से परे है।
इस समय किसी राजनीतिक दल के साथ खड़े होने का कोई मतलब नहीं है। हर हिंदुस्तानी को हिंदुस्तान के साथ खड़ा होना होगा, हमारी सरजमीं की अखंडता के साथ खड़ा होना होगा।
और जो सरकार..1/2 pic.twitter.com/2reTNjnWKN
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 29, 2020