Bombay High Court: తన కుమార్తె మరణానికి వారే కారణం.. రూ.1000 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ న్యాయస్థానానికి..
ఎవరి పరువుకైనా నష్టం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తారు. అదే ఎవరి చావుకైనా ఇతర వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థల నిర్లక్ష్యం కారణంగా చనిపోయారని భావిస్తే పరిహరం..
Bombay High Court: ఎవరి పరువుకైనా నష్టం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తారు. అదే ఎవరి చావుకైనా ఇతర వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థల నిర్లక్ష్యం కారణంగా చనిపోయారని భావిస్తే పరిహరం కోరవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా ఏదైనా విపత్తుల కారణంగానో, ప్రత్యే్క పరిస్థితుల్లో వ్యక్తులు చనిపోతే పరిహారాన్ని ప్రకటిస్తారు. అయితే ఆపరిహరం లక్షలో ఉంటుంది. కాని.. తన కుమార్తె మరణానికి ఓ టీకా సంస్థ కారణమంటూ మృతురాలి తండ్రి కోర్టును ఆశ్రయించారు. తనకు టీకా సంస్థనుంచి రూ.1000 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ ముంబై కోర్టును ఆశ్రయించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని మృతురాలి తండ్రి న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆరోపణలపై స్పందన తెలియజేయాలంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థతో పాటు ఇతర ప్రతివాదులను కోరుతూ.. కేసు తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
మహారాష్ట్రకు చెందిన దిలీప్ లునావత్ కుమార్తె స్నేహాల్ లునావత్ ఓ వైద్య విద్యార్థిని. నాసిక్లో చదువుతున్న 2021 జనవరిలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత తీవ్ర జ్వరం, వాంతులు మొదలుకావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు స్నేహాల్ మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి 2021 మార్చి 1న ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యాక్సిన్ అనంతర దుష్ప్రభావాల కమిటీ -AEFI గతేడాది అక్టోబర్ 2న నివేదిక ఇచ్చింది. తన కుమార్తె మరణానికి టీకానే కారణమని ఆరోపిస్తూ.. AEFI ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె తండ్రి దిలీప్ లునావత్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, జస్టిస్ మాధవ్ జందార్లతో కూడిన ధర్మాసనం.. వ్యాక్సిన్ సంస్థతో పాటు కేంద్రప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.
మరిన్ని జాతీయవార్తల కోసం చూడండి..