National Voters’ Day 2021: ఇవాళ జాతీయ ఓటరు దినోత్సవం.. ‘హలో ఓటర్స్’ను ఆవిష్కరించనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి
జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను ఆవిష్కరించనున్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఐదుగురు కొత్త ఓటర్లకు ఈ ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడీలను అందించనున్నారు.
National Voters’ Day 2021 : జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను ఆవిష్కరించనున్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఐదుగురు కొత్త ఓటర్లకు ఈ ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడీలను అందించనున్నారు.
మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ-ఓటర్ కార్డు రూపొందించారు. పీడీఎఫ్ రూపంలో ఈ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. డిజిటల్ లాకర్లలోనూ భద్రపరుచుకోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
కాగా, నేడు 11వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ‘మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్ఫార్మ్డ్’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తోంది భారత ఎన్నికల కమిషన్. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వర్చువల్గా పాల్గొననున్నారు. గౌరవ అతిథి హోదాలో మంత్రి రవి శంకర్ ప్రసాద్ కార్యక్రమానికి హాజరవుతారు.
కార్యక్రమంలో భాగంగా 2020-21 సంవత్సరంలో ఎన్నికలకు సంబంధించి జాతీయ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రకటించనున్నారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసీకి చెందిన వెబ్రేడియో ప్లాట్ఫాం- ‘హలో ఓటర్స్’ను ఆవిష్కరించనున్నారు.
2011 జనవరి 25 నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఈసీ నిర్వహిస్తోంది. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతోంది.