శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు 15 రోజుల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా.. ఎందుకంటే..?
పరువు నష్టం కేసులో శివసేన ఎంపీ (ఉద్ధవ్ వర్గం) సంజయ్ రౌత్ దోషిగా తేలింది. కోర్టు అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధించారు.
పరువు నష్టం కేసులో శివసేన ఎంపీ (ఉద్ధవ్ వర్గం) సంజయ్ రౌత్ దోషిగా తేలింది. కోర్టు అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధించారు. భారతీయ జనతా పార్టీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా కిరీట్ రౌత్పై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారు. దీంతో ఆయనపై మేధా రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశారు.
ముంబైలోని శివరి కోర్టులో మేధా సోమయ్య పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసులో శివసేన ఎంపీని కోర్టు దోషిగా నిర్ధారించింది. సంజయ్ రౌత్కు కోర్టు 15 రోజుల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించిందని మేధా తరపు న్యాయవాది వివేకానంద్ గుప్తా తెలిపారు. వాస్తవానికి, రూ.100 కోట్ల టాయిలెట్ స్కాంలో మేధా ప్రమేయం ఉందని రౌత్ ఆరోపించారు. మేధా రౌత్ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. రౌత్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అవమానకరమైనవి అంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు సంజయ్ రౌత్ను దోషిగా నిర్ధారించింది.
Maharashtra | Metropolitan Magistrate Mazgaon convicts Shiv Sena (UBT) leader Sanjay Raut in the defamation case on a complaint filed by Dr. Medha Kirit Somaiya, wife of BJP leader Kirit Somaiya: Vivekanand Gupta, advocate for Dr. Medha Kirit Somaiya
— ANI (@ANI) September 26, 2024
విషయం 2022 సంవత్సరానికి సంబంధించినది. ములుంద్లోని టాయిలెట్ స్కాంలో మేధా సోమయ్య ప్రమేయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దీని తర్వాత, కిరీట్ సోమయ్య ఈ ఆరోపణకు రుజువు ఇవ్వమని సంజయ్ రౌత్ను సవాలు చేశారు. కానీ సంజయ్ రౌత్ ఎటువంటి ఆధారాలు ఇవ్వకపోవడంతో, మేధా సోమయ్య సంజయ్ రౌత్పై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. ఆ ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ మరుసటి రోజు ఏప్రిల్ 16న రౌత్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారని సోమయ్య ఆరోపించారు. తన వాదనలకు మద్దతుగా రౌత్ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ను కోర్టుకు సమర్పించారు. సోమయ్య ఆరోపణలను ప్రధాన వార్తా ఛానళ్లు విస్తృతంగా ప్రసారం చేశాయన్నారు. మా పరువు తీసే ప్రయత్నం జరిగిందని కోర్టుకు నివేదించారు. దీనిపై కోర్టు తీర్పుపై సంజయ్ రౌత్ స్పందించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తానని, అయితే వారు అలాంటి ఆదేశాలను జారీ చేశారని నమ్మలేకపోతున్నానని శివసేన ఎంపీ సంజయ్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..