Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా .. తాజాగా 63,309 పాజిటివ్ కేసులు
Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాటిజివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన..
Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాటిజివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 985 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,73,394కు, మొత్తం మరణాల సంఖ్య 67,234కు చేరింది. మరో వైపు మరోవైపు గత 24 గంటల్లో 61,181 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 37,30,729కు చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,73,481 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. మరోవైపు కరోనా కట్టడికి నిర్వహిస్తున్న లాక్డౌన్ తరహా ఆంక్షలను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కొందరు కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: