చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ.. షాప్ ఓనర్ బంపర్ ఆఫర్.. ఎగబడుతున్న జనం. ఎక్కడంటే..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పెట్రోల్ తక్కువ ధరకు ఇస్తాము అంటేనే జనాలు పరిగెడతారు. అలాంటిది ఫ్రీగా పెట్రోల్ ఇస్తాము అంటే..
ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్ తక్కువ ధరకు ఇస్తాము అంటేనే జనాలు పరిగెడతారు. అలాంటిది ఫ్రీగా పెట్రోల్ ఇస్తాము అంటే.. ఇంకా చెప్పాల్సిన పనిలేదు. పెట్రోల్ బంక్ ముందు కిలోమీటర్ మేర క్యూ కట్టేస్తారు. కానీ నిజంగానే పెట్రోల్ ఫ్రీగా ఇస్తామంటూ ఓ వ్యాపారి ప్రకటించాడు. దీంతో అతని షాప్కు జనాలు ఎగబడుతున్నారు. కానీ ఫ్రీగా పెట్రోల్ అంటే.. ఇక్కడే ఓ చిన్న ట్వీస్ట్ ఉందడోయ్… ఫ్రీగా పెట్రోల్ కావాలంటే… ముందుగా చేపలు కొనాల్సిందే.. అది కూడా రూ. 500లకు పైగా చేపలను కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. తమిళనాడులోని మధురై పట్టణంలో ఓ వ్యాపారి ఆలోచన ఇది. అనుకున్నదే చాలు.. ఈ వినూత్నమైన ఆలోచనను. .. రూ.500లకు పైగా చేపలు కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అంటూ.. తన దుకాణం ముందు బోర్డ్ పెట్టాడు. దీంతో ఆదివారం నుంచి జనం ఆ షాప్కు ఎగబడుతున్నారు. చేపలు కొన్నవారికి పెట్రోల్ కోసం కూపన్లు అందజేశారు.
ఇక చేపల షాపు యాజమాని మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా దుకాణంకు వచ్చే కస్టమర్ల సంఖ్య ఏమాత్రం పెరగడం లేదని.. రోజూవారీ వినియోగదారులు కేవలం రూ.500 కంటే తక్కువ ధరకే చేపలు కొంటున్నారని తెలిపారు. కానీ ప్రస్తుతం రూ. 500 కంటే ఎక్కువగా ధరకు చేపలు విక్రయించినట్లుగా చెప్పారు.
ఇదిలా ఉంటే.. దిండిగల్లోని ఓ నాన్ వెజ్ దుకాణం కూడా ఇదే మాదిరిగా ఆదివారం వినయోగదారులకు ఆఫర్ ప్రకటించింది. తమ దుకాణంలో మాంసం కొన్నవారికి వెండి వస్తువులను అందించింది. చిన్న పట్టిలోని అనంత్ మటన్ దుకాణంలో ఒక కిలో మటన్ రూ. 100 విలువ చేసే ఒక వెండి పాత్రను రూ. 690 తగ్గింపు ధరకు ఇచ్చారు. బోన్ లెస్ మటన్ కిలో రూ. 800 విక్రయించారు. దీంతో తమ దుకాణంకు మటన్ కొనడానికి ఎక్కువగా మంది వచ్చారని సదరు షాపు యాజమాని తెలిపారు.
Also Read: