పశుగ్రాసం కేసులో లాలూ యాదవ్ కి బెయిల్, అయితే …?
రెండు పశుగ్రాసం కేసుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి ఓ దానిలో బెయిల్ లభించింది. చైబాసా ట్రెజరీ కేసులో ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రెండు పశుగ్రాసం కేసుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి ఓ దానిలో బెయిల్ లభించింది. చైబాసా ట్రెజరీ కేసులో ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ డుంకా కేసుకు సంబంధించి అయన ఇంకా జైల్లోనే గడపాల్సి వస్తుంది. (ఆ కేసు ఇంకా పెండింగులో ఉంది). గతంలో రాష్ట్ర సీఎంగా ఉండగా డుంకా ట్రెజరీ నుంచి ఆయన మోసపూరితంగా రూ. 3.5 కోట్లను విత్ డ్రా చేశారన్నది ఆరోపణ. 2018 లోనే ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆయనకు 14 ఏళ్ళ జైలుశిక్ష, 60 లక్షల జరిమానా విధించింది. ఇక చైబాసా ట్రెజరీ నుంచి ఫేక్ అలాట్ మెంట్ లెటర్స్ ని ఉపయోగించి లాలూ ప్రసాద్ యాదవ్ రూ. 33.67 కోట్లను విత్ డ్రా చేశారని సీబీఐ అప్పట్లోనే ఆరోపించింది. ఈ కేసులో ఆయనను దోషిగా పేర్కొంది.