ఇక అంతా స్వదేశీ…
అన్నిసెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలంటూ ఆర్డర్ జారీ చేసింది కేంద్రం. ఇందులో 1000కి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. కేవలం మేకిన్ ఇండియా వస్తువులనే ఉపయోగించాలే నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు దేశంలోని అన్నిసెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలంటూ ఆర్డర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. 1000కి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. కేవలం మేకిన్ ఇండియా వస్తువులనే ఉపయోగించాలే నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రీయ పోలీస్ కల్యామ్ భండార్లలో స్వదేశీ వస్తువులు మాత్రమే లభించనున్నాయి.
విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్కెచ్చర్లు, ఫెర్రెరో, రెడ్ బుల్, విక్టోరైనోక్స్, సాఫిలో వస్తువుల్ని కూడా నిషేధించింది. ఇకపై KPKB క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే మాత్రమే స్టోర్స్లో ఉంచనున్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వదేశీ ఉత్పత్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.