‘ మావాళ్లను గుర్తు పట్టాం ‘ ‘ ఐసిస్ ‘ పిల్లల తల్లుల భావోద్వేగం

ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని రోజులక్రితం భద్రతా దళాలకు లొంగిపోయిన ఐసిస్ ఉగ్రవాదుల్లో ఉన్నవారిలో తమ పిల్లలను తాము గుర్తు పట్టామని కేరళకు చెందిన ఓ మహిళ, తమిళనాడులోని పొలాచ్చికి చెందిన మరో మహిళ చెబుతున్నారు. ఓ ఫొటోలో తన కూతురును, అల్లుడ్ని, మనుమరాలిని గుర్తు పట్టినట్టు కేరళ.. తిరువనంతపురంలో నివసించే బిందు సంపత్ అనే మహిళ తెలిపింది. ఈ ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ) విడుదల చేసింది. పొలాచ్చి వాసి అయిన గ్రేసీ […]

' మావాళ్లను గుర్తు పట్టాం ' ' ఐసిస్ ' పిల్లల తల్లుల భావోద్వేగం
Follow us

|

Updated on: Nov 28, 2019 | 7:43 PM

ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని రోజులక్రితం భద్రతా దళాలకు లొంగిపోయిన ఐసిస్ ఉగ్రవాదుల్లో ఉన్నవారిలో తమ పిల్లలను తాము గుర్తు పట్టామని కేరళకు చెందిన ఓ మహిళ, తమిళనాడులోని పొలాచ్చికి చెందిన మరో మహిళ చెబుతున్నారు. ఓ ఫొటోలో తన కూతురును, అల్లుడ్ని, మనుమరాలిని గుర్తు పట్టినట్టు కేరళ.. తిరువనంతపురంలో నివసించే బిందు సంపత్ అనే మహిళ తెలిపింది. ఈ ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ) విడుదల చేసింది. పొలాచ్చి వాసి అయిన గ్రేసీ థామస్ అనే మరో మహిళ.. తన కొడుకు చేతులు, నుదురు గుర్తు పట్టానని, అతడు తన కుమారుడేననడంలో ఏ మాత్రం అనుమానం లేదని అంటోంది. తమవాళ్లు త్వరలో తమను చేరుకోగలరని వీరు గంపెడంత ఆశతో ఉన్నారు. సుమారు మూడేళ్ళ క్రితం కేరళ నుంచి దాదాపు 21 మంది ఐసిస్ లో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాలకు తమ కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. అయితే ఇటీవలే సుమారు 900 మంది తమ ఆయుధాలతో సహా ఆఫ్ఘనిస్థాన్ లో సెక్యూరిటీ దళాలకు లొంగిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్థానీయులు కాగా.. కేరళకు చెందిన పది, పన్నెండు మంది కూడా ఉన్నారు. కాగా- తన కుమార్తె, అల్లుడు తరచూ తమ ఫోటోలను, వాయిస్ రికార్డింగులను తనకు పంపుతుంటారని, వాటి ద్వారా ఈ ఫోటోల్లో వారిని గుర్తు పట్టానని బిందు సంపత్ పేర్కొంది. చివరిసారిగా గత ఏడాది నవంబరు 26 న వారి గొంతులను ఆమె విన్నదట. వాళ్లకు ఇష్టమైన వంటలు, దోసె, కర్రీ చేసి పెడతానని, ఎంత త్వరగా వాళ్ళు వస్తే తాను అంతగా సంతోషిస్తానని ఆమె చెబుతోంది.

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్