భారతదేశంలో పుట్టిన వారందరూ హిందువులే.. కేరళ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు…
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. భారతదేశంలో ఎవరు జన్మించినా.. ఇక్కడ భోజనం చేసినా వారందరినీ హిందువులుగా పిలిచేందుకు అర్హత సాధించినట్లేనని..
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. భారతదేశంలో ఎవరు జన్మించినా.. ఇక్కడ భోజనం చేసినా వారందరినీ హిందువులుగా పిలిచేందుకు అర్హత సాధించినట్లేనని అన్నారు. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ) వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ హిందూ సదస్సులో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గననార్హం. హిందూ సమ్మేళనంలో ఆర్య సమాజ్ సమావేశంలో సర్ సయ్యద్ ఖాన్ చెప్పిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. అందులో ‘మీరు నన్ను హిందువు అని పిలవాలి’ అని చెప్పారు. భారతదేశంలో జన్మించిన వారైనా, భారతదేశంలో ఉత్పత్తి చేసే ఆహారంపై ఆధారపడిన వారైనా, భారతదేశంలోని నదుల నీటిని తాగే వారైనా హిందువుగా చెప్పుకునే హక్కు లేదన్న అలీఘర్ యూనివర్సిటీ వ్యవస్థాపకుల మాటలను ఆయన ఖండిస్తూ.. తనను హిందువుగా పరిగణించాలని చెప్పడం విశేషం.
వలస పాలనలో సర్ సయ్యద్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పదవీకాలం పూర్తి చేసినప్పుడు, ఆర్యసమాజ్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారని గవర్నర్ చెప్పారు. తనను హిందువు అని ఎందుకు పిలవలేదో సర్ సయ్యద్ ఆర్యసమాజ్ సభ్యులకు చెప్పారని, తాను హిందూ అనే పదాన్ని మతపరమైన పదంగా పరిగణించడం లేదని ఆయన అన్నారు. హిందూ అనేది భౌగోళిక పదం అన్న ఆయన.. తనను హిందువు అని ఎందుకు పిలవరని ప్రశ్నించారు.
కేరళ హిందూ ఆర్గనైజేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (KHNA) ఈ సదస్సును నిర్వహించింది. ఇక్కడి మస్కట్ హోటల్లో జరిగిన సదస్సుకు కేంద్ర మంత్రి వి మురళీధరన్ హాజరయ్యారు. ‘నేను హిందువును’ అనడం సరికాదని భావించేలా రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..