మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఆయనే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ వర్గీయ..
మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నేతృత్వంలోనే ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమా? ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి మోదీ చక్రం తిప్పారా?
మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నేతృత్వంలోనే ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమా? ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి మోదీ చక్రం తిప్పారా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి కైలాస్ విజయ వర్గీయ. బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండోర్లో జరిగిన కార్యకర్తల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కైలాస్ విజయ్ వర్గీయ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లోని కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ మాటలు మరెవరికీ చెప్పకండి. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో అసలు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమేయమే లేదు’ అని వర్గీయ బేజేపీ కార్యకర్తలతో అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కైలాస్ విజయ వర్గీయ కామెంట్స్కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Kailash Vijayvargiya’s stunning disclosure in Indore: Narendra Modi played important role in fall of Kamal Nath government in Madhya Pradesh. @NewIndianXpress @TheMornStandard pic.twitter.com/D96fclcxhY
— Anuraag Singh (@anuraag_niebpl) December 16, 2020