కర్నాటకలో సీఎం ఎడ్యూరప్ప పదవికి ఢోకా లేనట్టే ! బాగా పని చేస్తున్నారన్న బీజేపీ చీఫ్ జె.పి. నడ్డా
కర్ణాటకలో సీఎం ఎడ్యూరప్పనాయకత్వాన్ని మార్చవచ్చునని ఊహాగానాలు రేకెత్తిన వేళ..వాటికి చెక్ పెడుతూ ..అలాంటి ఉద్దేశమేదీ లేదని బీజేపీ చీఫ్ జె.పి. నడ్డా ప్రకటించారు.
కర్ణాటకలో సీఎం ఎడ్యూరప్పనాయకత్వాన్ని మార్చవచ్చునని ఊహాగానాలు రేకెత్తిన వేళ..వాటికి చెక్ పెడుతూ ..అలాంటి ఉద్దేశమేదీ లేదని బీజేపీ చీఫ్ జె.పి. నడ్డా ప్రకటించారు. ఎడ్యూరప్ప పని తీరును ప్రశంసించారు. రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభాన్ని కొట్టి పారేసిన ఆయన.. ఎడ్యూరప్ప బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. కర్ణాటకలో పార్టీ సంక్షోభంలో ఉందని తాను అనుకోవడంలేదన్నారు. ‘హీ హ్యాజ్ రన్ గుడ్ జాబ్.. హీ ఈజ్ రన్నింగ్ కర్ణాటక వెల్'( ఆయన బాగా పని చేస్తున్నారు) అని వ్యాఖ్యానించారు. ఆయన సొంతంగా అన్ని అంశాలనూ హ్యాండిల్ చేస్తున్నారని నడ్డా చెప్పారు. అసలు రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో ఉందని మీడియా భావిస్తున్నట్టు కనబడుతోందన్నారు. కాగా అంతకుముందు.. ఈ ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడిన యెడ్యూరప్ప.. ఈ సాయంత్రానికి పార్టీ హైకమాండ్ నుంచి ఏ సందేశమైనా రావచ్చునని, దానికి తాను కట్టుబడి ఉంటానని వెల్లడించారు. పార్టీ ఎప్పుడు ఆదేశించినా పదవీ నుంచి దిగిపోవడానికి సిద్దమేనన్నారు.
నిజానికి రాజీనామా చేయాలని పార్టీ నేతలు తనను కోరలేదని ఎడ్యూరప్ప ఇటీవల ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే ఏ క్షణం ఆదేశించినా వైదొలగుతానని, పార్టీకి విధేయుడైన సేవకుడిలా పని చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుంచి ఇక రాష్ట్రంలో పార్టీ నాయకత్వం మారే సూచనలున్నాయని అంతా భావించారు. నిన్నటికి నిన్న ఆయన కుమారుడు విజయేంద్ర ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఏమైనా నడ్డా ప్రకటనతో ఇక కర్ణాటకలో ఎడ్యూరప్ప పదవిలో కొనసాగుతారన్న విషయం స్పష్టమైంది. ప్రస్తుతం ఆయన వరదలకు గురైన బెళగావి జిల్లాలో పర్యటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Eluru Municipal Corporation Election Results: అదే రీసౌండ్, అదే రిజల్ట్.. ఏలూరు గడ్డపై వైసీపీ ఘన విజయం