Jharkhand Politics: జార్ఖండ్లో మళ్లీ పొలిటికల్ డ్రామా.. ప్రత్యేక విమానంలో రాయ్పూర్కు యూపీఏ కూటమి ఎమ్మెల్యేలు
యూపీఏ కూటమి ఎమ్మెల్యేలను చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం కూటమి ఎమ్మెల్యేలతో రాయ్పూర్ వెళ్తున్నారు సీఎం హేమంత్ సోరెన్. అనర్హత వేటుపై..
జార్ఖండ్లో మళ్లీ పొలిటికల్ డ్రామా ఊపందుకుంది. యూపీఏ కూటమి ఎమ్మెల్యేలను చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం కూటమి ఎమ్మెల్యేలతో రాయ్పూర్ వెళ్తున్నారు సీఎం హేమంత్ సోరెన్. అనర్హత వేటుపై గవర్నర్ ఏ క్షణంలోనైనా నిర్ణయిం ప్రకటించే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించారు. అక్రమ మైనింగ్ కేసులో ఈసీ హేమంత్సోరెన్పై అనర్హత వేటు వేయాలని ఈసీ కమిటీ సూచించింది. హేమంత్ సోరెన్ సీఎం పదవిని కోల్పోతే తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతుందన్న భయం కూటమి నేతలకు పట్టుకుంది. అందుకే ఎమ్మెల్యేలను రాయ్పూర్ రిసార్ట్కు తరలిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక విమానాన్ని రెడీ చేశారు. రాయ్పూర్ లోని మేఫేర్ రిసార్ట్లో రూమ్లను కూడా ఎమ్మెల్యేల కోసం బుక్ చేశారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్కు తీసుకెళ్తారని చెబుతున్నారు. వారిని ఛత్తీస్గఢ్కు తీసుకెళ్లేందుకు ఇండిగో 72 సీట్ల విమానం (ATR-72) బుక్ చేయబడింది. రాయ్పూర్లోని మేఫెయిర్ గోల్ఫ్ రిసార్ట్లో 2 రోజులుగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు చెబుతున్నారు.
72 సీట్ల ఇండిగో విమానం 5 గంటలకు..
ఈ 72 సీట్ల ఇండిగో విమానం సాయంత్రం 5 గంటలకు రాంచీ విమానాశ్రయానికి చేరుకుంటుందని స్థానిక మీడియా తెలిపింది. ఈ విమానంలో ఎంత మంది ఎమ్మెల్యేలు వెళతారు. వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. మరోవైపు మహాకూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటున్నారు. రామేశ్వర్ ఓరాన్, మిథిలేష్ ఠాకూర్, జాగర్నాథ్ మహ్తో, అనూప్ సింగ్, శిల్పి నేహా టిర్కీ, అంబా ప్రసాద్, బాదల్ పత్రలేఖ్, సుదివ్య, హఫీజుల్ హసన్, ఉమాశంకర్ అకేలా, మధుర మహ్తో, చంపాయ్ సోరెన్, బన్నా గుప్తా, సమీర్ మహంతి, బైద్యనాథ్ రామ్, జోబా తి మంజీ, భూషణ్ తి మంజీ సీఎంఓ కంకే రోడ్డుకు చేరుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..