ఆసుపత్రిలో ఘోరం.. వైద్య దంపతులు సహా ఆరుగురు దుర్మరణం.. అర్ధరాత్రి అంతా నిద్రస్తుండగా..
జార్ఖండ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ధన్బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డాక్టర్ దంపతులు సహా ఆరుగురు మృతి చెందారు.
జార్ఖండ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ధన్బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డాక్టర్ దంపతులు సహా ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిది మందిని ఆసుపత్రి నుంచి రక్షించినట్లు వెల్లడించారు. ధన్బాద్ బ్యాంక్ మోడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని హజ్రా క్లినిక్లో శనివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులు సహా ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టర్ రూమ్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. క్రమంగా, మంటలు 1వ అంతస్తుకు వ్యాపించాయని.. దీంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తులు తమను తాము రక్షించుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. మృతులను డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య డాక్టర్ ప్రేమ హజ్రా, యజమాని మేనల్లుడు సోహన్ ఖమారి, ఇంటి పనిమనిషి తారా దేవి, మరో ఇద్దరు ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
చనిపోయిన డాక్టర్ దంపతులు తన కటుంబంతో కలిసి ఆస్పత్రి ఫస్ట్ ఫ్లోర్లో నివసిస్తున్నారు. ఆసుపత్రి, నివాస భవనం ఒకటే. అయితే, అర్థరాత్రి దాటాక అందరూ గాఢ నిద్రలో ఉండగా స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయి. స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే పై ఫ్లోర్స్కు వ్యాపించాయి. మంటలు చుట్టుముట్టేయడంతో బయటకు రాలేక ఐదుగురు సజీవదహనమయ్యారు. మరొక మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని.. ధన్బాద్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ప్రేమ్ కుమార్ తివారీ తెలిపారు.
అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని.. ఆసుపత్రిలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..