Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లో స్థానికేతరులకు కూడా ఓటుహక్కు..ఈసీ నిర్ణయంపై కశ్మీర్ విపక్షాల ఆగ్రహం
ఆర్టికల్ 370 రద్దుతో స్థానికేతరులు కూడా జమ్ముకశ్మీర్లో ఓటు వేయవచ్చన్న ఈసీ నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ పార్టీలు మండిపడుతున్నాయి. కశ్మీర్ను బీజేపీ ప్రయోగశాలగా మార్చిందని విమర్శించారు మెహబూబా ముఫ్తీ. దీనిపై విపక్షాలు పోరాటం చేస్తాయని ఆమె ప్రకటించారు.
జమ్ముకశ్మీర్లో నివసిస్తున్న స్థానికేతరులు కూడా ఓటు వేయవచ్చన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై రగడ రాజుకుంది. ఈసీ నిర్ణయంపై జమ్ముకశ్మీర్ విపక్షాలు మండిపడుతున్నాయి. కశ్మీర్ను బీజేపీ ప్రయోగశాలగా మార్చేసిందని విమర్శించారు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ. బీజేపీ విధానాలతో భారత్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందన్నారు. కశ్మీర్లో చేసిన ప్రయోగాలను దేశం లోని ఇతర రాష్ట్రాల్లో కూడా కచ్చితంగా చేస్తారని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 25 లక్షల మంది నాన్లోకల్స్ కూడా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. స్థానికులు కానప్పటికి , ఇతర రాష్ట్రాల్లో ఓటును నమోదు చేసుకోని వాళ్లు జమ్ముకశ్మీర్లో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుతో ఈ మార్పులు చేస్తునట్టు వెల్లడించారు. అయితే దీనిపై పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ , నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పాలస్తీనాను ఇజ్రాయెల్ ఆక్రమించినట్టు కశ్మీర్ను బీజేపీ ఎన్నికలతో ఆక్రమించే కుట్ర చేస్తోందన్నారు మెహబూబా. కొన్ని సార్లు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరుగుతుందని, కొన్ని సందర్భాల్లో ఎన్నికల తర్వాత కూడా రిగ్గింగ్ జరుగుతుందని, మహారాష్ట్రలో అలాగే జరిగిందన్నారు. క ఈడీ లాంటి ఏజెన్సీలను ఆ రిగ్గింగ్ కోసం బీజేపీ వినియోగిస్తోందని, ఈడీ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా మారిందని ముఫ్తీ ఆరోపించారు. బీజేపీ ఇక్కడ నాజీ జర్మనీ పాలసీ, ఇజ్రాయెల్ పాలసీని అమలు చేసి కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. జమ్ముకశ్మీర్లో దొంగదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి… అదే విధానాన్ని దేశమంతా అమలు చేసే ప్రయత్నాల్లో ఉంది. హిట్లర్ చాలా అమానుషాలకు పాల్పడ్డారు. కాని యూదులను అంతం చేయలేకపోయారు.
జమ్ముకశ్మీర్లో స్థానికేతరులకు ఓటుహక్కు కల్పించడంపై పోరాటం చేసేందుకు కలిసి పోరాటం చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ పార్టీలు నిర్ణయించాయి. దీనిపై ఫరూఖ్ నివాసంలో ఈనెల 22వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం